IPL 2023: హార్దిక్ పాండ్యాకు జరిమానా.. కారణం అదే

by Vinod kumar |
IPL 2023: హార్దిక్ పాండ్యాకు జరిమానా.. కారణం అదే
X

మొహాలీ: గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది. మ్యాచ్‌ను 3 గంటల 20 నిమిషాల్లో ముగించాలని ఐపీఎల్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ ఈ స్లో ఓవర్ రేట్ సమస్యగా మారింది. చాలా మ్యాచ్‌ల సమయం నాలుగు గంటలు దాటిపోతోంది. ‘మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో పాండ్యా జట్టు తొలి నేరానికి పాల్పడింది. దీంతో అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ శుక్రవారం తెలిపింది.

Also Read..

IPL 2023: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌..

Next Story

Most Viewed