గుజరాత్ గ్రాండ్ విక్టరీ.. ఐపీఎల్ నుంచి RCB అవుట్

by Disha Web Desk 12 |
గుజరాత్ గ్రాండ్ విక్టరీ.. ఐపీఎల్ నుంచి RCB అవుట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచులు ముగిసాయి. లీగ్ స్టేజ్‌లోని చివరి మ్యాచ్ గుజరాత్, ఆర్సీబీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్‌తో సెంచరీ నమోదు చేసినప్పటికి వృధాగా పోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ శుభ్‌మాన్ గిల్ 104, విజయ్ శంకర్ 53 పరుగులతో రెచ్చిపోవడంతో ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే.. విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2023 నుంచి అవుట్ అయింది. కాగా ఈ సీజన్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ గుజరాత్, ఆర్సీబీ మధ్య ఈ నెల 23న జరగనుంది.

Next Story

Most Viewed