ధోనీ ఫొటోపై సాక్షి రియాక్షన్.. ఓడిపోయామని ఇంకా తెలియదేమో అంటూ కామెంట్

by Dishanational3 |
ధోనీ ఫొటోపై సాక్షి రియాక్షన్.. ఓడిపోయామని ఇంకా తెలియదేమో అంటూ కామెంట్
X

దిశ, స్పోర్ట్స్ : మిస్టర్ కూల్ ఎం.ఎస్ ధోనీ మైదానంలో టెన్షన్ పడటం చాలా అరుదుగా చూస్తుంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా కూల్‌గా ఉంటాడు. విజయమైనా.. ఓటమైనా ఒకేలా తీసుకుంటాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోనీకి ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

అవార్డు అందుకునే సమయంలో ధోనీ ముఖంలో ఎలాంటి ఓటమి బాధ కనిపించలేదు. దీంతో ఆ ఫొటోపై ధోనీ భార్య సాక్షి ఫన్నీగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను పోస్టు చేస్తూ..‘ముందుగా రిషభ్ పంత్‌కు ఘన స్వాగతం. మ్యాచ్‌‌ను మనం ఓడిపోయామని ధోనీకి ఇంకా తెలియదనుకుంటా’ అని సాక్షి రాసుకొచ్చింది. ఓటమి బాధ లేకుండా ధోనీ నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇవ్వడంతో సాక్షి ఇలా ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగగా.. నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఆ మ్యాచ్‌లో ధోనీ ఆట కచ్చితంగా చూసి తీరాల్సిందే. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను మెరుపు ఇన్నింగ్స్‌తో వింటేజ్ ధోనీని గుర్తు చేశాడు. 42 ఏళ్ల వయసులోనూ తనలో ఇంకా సత్తా ఉందని నిరూపించాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందుకుగానూ ధోనీకి ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే, ఆ మ్యాచ్‌లో చెన్నయ్‌ 20 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed