ప్రారంభ మ్యాచ్ లోనే రికార్డ్ సృష్టించిన ధోనీ

by Dishafeatures2 |
ప్రారంభ మ్యాచ్ లోనే రికార్డ్ సృష్టించిన ధోనీ
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టాటా ఐపీఎల్ 2023 ఘనంగా ప్రారంభమైంది. ఇక మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మొదలైంది. ఇక సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ ధోనీ మరో రికార్డ్ సృష్టించాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున జోష్ లిటిల్ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడో బంతిని సిక్స్‌ బాదడంతో ధోనీ 200 సిక్స్‌ల మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకే జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున క్రిస్‌గేల్(239) టాప్‌లో ఉండగా.. ఏబీ డెవిలియర్స్(ఆర్సీబీ, 238), కీరన్ పొలార్డ్ (ముంబై, 223), విరాట్ కోహ్లీ (ఆర్సీబీ, 218) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Next Story

Most Viewed