IPLలో తెలుగు కుర్రాడి అరంగేట్రం..కేంద్ర మంత్రి ప్రశంసలు

by velandi.Saikiran |

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేశాడు.

IPLలో తెలుగు కుర్రాడి అరంగేట్రం..కేంద్ర మంత్రి ప్రశంసలు
X

దిశ‌, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగగా తెలుగు కుర్రాడు త్రిపురాన విజయ్ కి అవకాశం దక్కింది. అయితే ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన త్రిపురాన విజయ్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీకాకుళం నేల ఎప్పుడూ ప్రతిభకు, పట్టుదలకు నిలయమే అని పేర్కొన్నారు. మన జిల్లా యువకుడు ప్రతిష్టాత్మక వేదికపై నిలవడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.

అడ్డంకులను ఛేదించి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్పష్టం చేశారు. అంకిత భావం, క్రమ శిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక నిన్న తన అరంగేట్ర మ్యాచ్ ఆడిన త్రిపురాన విజయ్ 2 ఓవర్లు వేసి ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ రాజస్థాన్ పైన ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం గెలిచింది.

Next Story