IPL : వైభవ్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

by Muthe.Rajitha |

IPL లో నేటి ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేయగా.. 7 వికెట్ల తేడాతో లక్నోపై సూపర్ విక్టరీ సాధించింది.

IPL : వైభవ్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : IPL లో నేటి ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వీర విహారం చేయగా.. 7 వికెట్ల తేడాతో లక్నోపై సూపర్ విక్టరీ సాధించింది. LSG, RR మధ్య జరిగిన నేడు జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్(96), ఇంగ్లిస్(60) పరుగులు చేసి రాణించారు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్.. జైస్వాల్(43), వైభవ్(93), జురెల్(53) పరుగులు చేసి జట్టును అలవోకగా గెలిపించారు. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ ను వెనక్కి నెట్టి రాజస్థాన్ 4వ స్థానానికి చేరుకుంది. ఇక మే 24న ముంబైతో జరిగే ఆఖరి మ్యాచులో RR గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరనుంది. ఇక ఈ సీజన్ నుంచి లక్నో నిష్క్రమించినట్టే. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకు పోయారు.

Next Story