- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BCCI : సన్రైజర్స్ లీడ్స్లో పాక్ స్పిన్నర్.. బీసీసీఐ క్లారిటీ!
విదేశీ క్రికెట్ లీగ్లో పాకిస్తాన్ ఆటగాడిని సన్రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశీ క్రికెట్ లీగ్లో పాకిస్తాన్ ఆటగాడిని సన్రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI) క్లారిటీ ఇచ్చింది. ఇంగ్లాండ్లో జరిగే 'ది హండ్రెడ్' (The Hundred) టోర్నీ కోసం పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను ‘సన్రైజర్స్ లీడ్స్’ జట్టు దక్కించుకోవడంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘బీసీసీఐ పరిధి కేవలం ఐపీఎల్ (IPL) వరకే పరిమితం. విదేశీ లీగ్లలో ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధం లేదు. భారత వెలుపల జరిగే లీగ్లలో ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లను తీసుకుంటారనేది వారి ఇష్టం. ఐపీఎల్లో మాత్రం పాక్ ఆటగాళ్లకు చోటు లేదు’ అని స్పష్టం చేశారు. విదేశీ లీగ్ల విషయంలో బోర్డు జోక్యం చేసుకోలేదని ఆయన తేల్చి చెప్పారు.
విమర్శల వెల్లువకు కారణమిదే!
గురువారం జరిగిన 'ది హండ్రెడ్' వేలంలో సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ అబ్రార్ అహ్మద్ను సుమారు రూ2.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే, ఈ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. గత ఏడాది మే నెలలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో అబ్రార్ అహ్మద్ భారత సైన్యాన్ని, వాయుసేనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్ లక్ష్యంగా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, 2008 తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్లో పాక్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.






