మైదానంలోకి దూసుకొచ్చి, కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్‌

by velandi.Saikiran |   (  Updated:2026-05-13 18:40:03  IST  )

కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా, అతని అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కాళ్లపై పడిపోయాడు.

మైదానంలోకి దూసుకొచ్చి, కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో బెంగళూరు, కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం దిశగా బెంగళూరు దూసుకు వెళ్తోంది. ఇలాంటి క్రమంలో రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఛేజింగ్ సమయంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా, అతని అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కాళ్లపై పడిపోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ రంగంలోకి దిగింది. ఆ తర్వాత కోహ్లీ అభిమానిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా, విరాట్ కోహ్లీ ఎక్కడ మ్యాచ్ ఆడినా సరే.. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కోహ్లీ అంటే ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులు ఉన్నారు. క్లిక్

Next Story