పంజాబ్ కింగ్స్‌లోకి షారుక్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?

by  |
పంజాబ్ కింగ్స్‌లోకి షారుక్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్-14 మినీ వేలంలో షారూక్ ఖాన్‌‌ను పంజాబ్ జట్టు రూ. 5.25 కోట్లకు దక్కించుకుంది. అతడు తన బేస్ ధర రూ. 20 లక్షలుగా నిర్ణయించుకోగా.. ఫ్రాంచైజీలు ఏకంగా 5.25 రూపాయాలకు కొనుగోలు చేశారు. ఇంతకీ పంజాబ్ జట్టు కోనుగోలు చేసింది ఏవరిననుకుంటున్నారు.. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని బాలీవుడ్ బాద్ షాను కాదు.. దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్న యువగాడు మసూద్ షారుక్ ఖాన్‌ను పంజాబ్ కోనుగోలు చేసింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం పంజాబ్ కింగ్స్‌ జట్టులో షారుక్ ‘ఖాన్’ వచ్చాడంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఎవరీ మసూద్ షారుక్ ఖాన్..?

మసూద్ షారుక్ ఖాన్ తమిళనాడుకు చెందినవాడు. 25 సంవత్సరాల యువఆటగాడు. చెన్నైలో జన్మించిన ఇతడు క్రికెట్ మీద మక్కువతో సాధన చేసి ఎట్టకేలకు తమిళనాడు జట్టులో చోటు సంపాధించాడు. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి దేశవాలీ క్రికెట్‌ ఆడుతూ వస్తున్నాడు. రంజీ, విజయ హజరే ట్రోఫీలో అందరినీ దృష్టిని ఆకర్షించిన ఇతడు.. ఇటీవల ఐపీఎల్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇందుకు బీసీసీఐ అనుమతి కూడా లభించగా.. తన ధర రూ. 20 లక్షలుగా నిర్ణయించకున్నాడు. కానీ, ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా రూ. 5.25 లక్షలకు కోనుగోలు చేసింది. దీంతో అతడి జీవితం మరో ములుపు తిరిగింది. ఇది ఇలా ఉంటే.. షారుక్ పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో ఎంట్రీ ఇచ్చాడంటూ నెట్టింట్లో ఫోటోలు వైరల్‌గా మారాయి.

Image


Next Story

Most Viewed