ఆయన రాక నాకెంతో సంతోషం: సంజూ

by  |
ఆయన రాక నాకెంతో సంతోషం: సంజూ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ శాంసన్ తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. దీనికి తోడు శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర అదే జట్టుకు.. తొలిసారిగా డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్(కోచర్)‌గా నియమితులయ్యారు. ఈ విషయంపై స్పందించిన సంజూ శాంసన్ ఆనందం వ్యక్తం చేశాడు. రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌ నియామకం అయిన సమయంలోనే సంగక్కర వంటి వారు కోచ్‌గా రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ అనుభూతి చాలా ప్రత్యేకమైనదని.. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడానికి ఐపీఎల్ 2021 కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, జట్టుకు తాను కెప్టెన్‌గా ఉండటం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందన్నాడు.

Next Story

Most Viewed