నాకు ఆహ్వానం అందలేదు : రవిశంకర్

by  |
నాకు ఆహ్వానం అందలేదు : రవిశంకర్
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామమందిరం భూమి పూజకు అధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్‌కు ఆహ్వానం అందినట్లు పలు వార్తా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.. దీనిపై ‘ఆర్డ్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ మంగళవారం స్పందించింది. ఈనెల 5న జరుగనున్న భూమి పూజ కార్యక్రమానికి రవింశర్‌ను ఆహ్వానించలేదని.. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలని తోసిపుచ్చింది.

అయితే, రవిశంకర్‌ను ఆహ్వానించినట్టు మీడియా ద్వారానే తమకు కూడా తెలిసిందని.. ‘భూమి పూజకు ఆహ్వానం అందలేదని’ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, యోగా గురువు రాందేవ్ బాబా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌‌లకు ఆహ్వానం అందగా వారు ఈరోజు అయోధ్య బయలుదేరారు.

Next Story