- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మేడ్చల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మ భూషణ్ పద్మ విభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బి.బలరామారావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 26, 2021 తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారని తెలిపారు. జిల్లాలో కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ తదితర రంగాల్లో సాధించిన లక్ష్యాలను, చేసిన కృషిని 800 పదాలకు మించకుండా రాసి, జూన్ 20,2020లోపు కీసరలో ఉన్న మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ బి బ్లాక్ కాంప్లెక్స్లోని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారికి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు www.padmawards.gov.in వెబ్ సైట్ చూడాలని లేదా 9701214073కి కాల్ చేయాలని సూచించారు. అభ్యర్థులు 3 సెట్ల ధరఖాస్తులతోపాటు సంబంధిత పేపర్ కట్టింగులు ఫొటోస్ జత చేయాలని ఆయన కోరారు.