నిరుద్యోగులకు శుభవార్త.. వెంటనే అప్లై చేసుకోండి

by  |
apply-now1
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లోని తెలుగు, ఇంగ్లీషు మీడియం కస్తూర్భా గాంధీ పాఠశాల, కళాశాలాల్లో నెలకొన్న ఖాళీ పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు 15 మంది సీఆర్టీ, 25 మంది పీజీ సీఆర్టీలు.. మొత్తం 40 మంది నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులు జిల్లా వాసులై వుండాలని, ఈ నెల 11వరకు పూర్తి ఒరిజినల్ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


Next Story