ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయా?

by  |
ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అదికాస్త వైరల్ కావడంతో బుధవారం ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వివరాల్లోకివెళితే.. ప్రకాశం జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో కరోనా బారిన పడి రిటైర్డ్ వీఆర్వో కాంతారావు మృతిచెందాడు.

అయితే, ఆస్పత్రిలో ఆవరణలో ఉన్న అతని మృతదేహాన్ని కుక్కులు పీక్కుతిన్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. వెంటనే స్పందించిన ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరు సభ్యుల బృందాన్ని నియమించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఈ ద్విసభ్య బృందం విచారణ చేపట్టింది. కాగా, ఆ ఆరోపణలు నిజామా, కాదా? అనేది తెలియాలంటే విచారణ పూర్తయ్యేవరకు వేచిచూడాల్సిందే.

Next Story