జనగామ లాఠీచార్జి ఘటనపై విచారణకు ఆదేశం

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్ : జనగామ బీజేపీ ఇన్‌చార్జి పవన్ శర్మపై లాఠీచార్జ్ ఘటనలో వెస్ట్‌జోన్ డీసీపీతో విచారణ జరిపించాలని కమిషనర్ ప్రమోద్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక అందజేసిన అనంతరం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పవన్ శర్మ, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండిచారు. 24గంటల్లోగా బాధ్యులపై చర్యలు ఆయన డిమాండ్ చేశారు. ఈ [&hellip;]</p>

జనగామ లాఠీచార్జి ఘటనపై విచారణకు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్ : జనగామ బీజేపీ ఇన్‌చార్జి పవన్ శర్మపై లాఠీచార్జ్ ఘటనలో వెస్ట్‌జోన్ డీసీపీతో విచారణ జరిపించాలని కమిషనర్ ప్రమోద్ కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక అందజేసిన అనంతరం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పవన్ శర్మ, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండిచారు.

24గంటల్లోగా బాధ్యులపై చర్యలు ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ చలో జనగామకు పిలుపునివ్వడంతో బీజేపీ శ్రేణులు భారీగా చేరుకుని డీసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు కావాలనే బీజేపీ కార్యకర్తలు, లీడర్లను టార్గెట్ చేసి మరి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story