- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరసన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు సింఘు, టిక్రి, ఘాజీపూర్లలో ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తూ కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు ఏరియాలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ అంతర్జాల సేవలు నిలిపేసింది. ఈ నెల 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ 11 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని వివరించింది. అత్యయిక పరిస్థితులు ఏర్పడకుండా, పబ్లిక్ సేఫ్టీని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 26వ […]</p>

X
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు సింఘు, టిక్రి, ఘాజీపూర్లలో ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తూ కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు ఏరియాలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ అంతర్జాల సేవలు నిలిపేసింది. ఈ నెల 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ 11 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని వివరించింది. అత్యయిక పరిస్థితులు ఏర్పడకుండా, పబ్లిక్ సేఫ్టీని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 26వ తేదీన నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన సంగతి తెలిసిందే.
Next Story






