నిరసన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్

by  |
నిరసన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు సింఘు, టిక్రి, ఘాజీపూర్‌లలో ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తూ కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు ఏరియాలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ అంతర్జాల సేవలు నిలిపేసింది. ఈ నెల 29 రాత్రి 11 గంటల నుంచి 31వ తేదీ 11 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని వివరించింది. అత్యయిక పరిస్థితులు ఏర్పడకుండా, పబ్లిక్ సేఫ్టీని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 26వ తేదీన నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన సంగతి తెలిసిందే.


Next Story