పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

by  |
intermediate exams
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగునున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,59,237 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు, పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలని ఆదేశాలు జారీ చేశారు. అర నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని స్పష్టమైన ఆదేశాలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా రెండు పరీక్షలు రీ షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. 70 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు.. ప్రశ్నల్లో 50 శాతానికి పైగా చాయిస్‌లు ఇచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed