తొందరపడిన ఇంటర్ విద్యార్థి.. ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండని..!

by  |
తొందరపడిన ఇంటర్ విద్యార్థి.. ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండని..!
X

దిశ, ధర్పల్లి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నాగేల్లి అభినవ్ (16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఇంటర్ ప్రథమ సంవత్సరం యస్ఆర్ కాలేజీలో చదువుతున్నాడు. గత కొంతకాలంగా అభినవ్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, దీంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మృతుని తండ్రి భూపాల్ బతుకుదెరువు కోసం దుబాయ్‌‌కు వలస వెళ్లాడు. చేతికందొచ్చిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, మృతుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడని, చనిపోయే నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండని పలువురు అనుకుంటున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు.


Next Story

Most Viewed