ఒంటిమీద గాయాల్లేవ్.. తీవ్ర రక్తస్రావంతో గిరిజన బాలిక మృతి!

by  |
ఒంటిమీద గాయాల్లేవ్.. తీవ్ర రక్తస్రావంతో గిరిజన బాలిక మృతి!
X

దిశ, డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధర్మారం శివారు సీతారాంపురం తండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని(16 ) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన శ‌నివారం మ‌ధ్యాహ్నం జ‌ర‌గగా సాయంత్రం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాలిక ఉద‌యం తండాలోని చెరువులో ఉపాధి ప‌నికి వెళ్లింది. అనంత‌రం అక్కడి నుంచి ఒంట‌రిగా తండాకు బయ‌ల్దేరింది. కానీ ఇంటికి చేరుకోలేదు. తండాకు ఓ ప‌ర్లాంగు దూరంలోని బండ‌రాయి వెనుకాల బాలిక జీవ‌శ్చవంలా ప‌డి ఉండ‌టాన్ని తండాకు చెందిన ఓ యువ‌కుడు చూసి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారమిచ్చాడు.

వెంట‌నే వారు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని అప‌స్మార‌క స్థితిలో ఉన్న బాలిక‌ను ఆర్‌ఎంపీ వ‌ద్దకు తీసుకెళ్లగా పరిక్షించిన వైద్యుడు మృతి చెందిన‌ట్లు తెలిపాడు. అయితే, బాలికకు తీవ్రరక్తస్రావం అయినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్యచేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని మ‌హ‌బూబాబాద్ ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. బాలిక ఒంటిపై ఎలాంటి గాయాలు లేకున్నా.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story