ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ గడువు పెంపు

by  |
ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ గడువు పెంపు
X

దిశ, న్యూస్‌బ్యూరో: 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అఫిలియేషన్ గడువును పెంచుతున్నట్టు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదనపు సెక్షన్లు మంజూరు కోసం దరఖాస్తు చేసే కళాశాలలు జూన్ 20 లోపు ఎటువంటి అదనపు రుసుం లేకుండా చేయొచ్చని స్పష్టం చేసింది. రూ.వెయ్యి ఆలస్యపు రుసుంతో ఈ నెల 27వరకు, రూ.3వేల ఆలస్యపు ఫీజుతో జూలై 4, రూ.5వేల ఫీజుతో జూలై 11, రూ.10 వేల ఫీజుతో జూలై 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ప్రకటనలో సూచించింది.

Next Story

Most Viewed