రాజకుటుంబాల మధ్య ముదిరిన వివాదం

by  |
రాజకుటుంబాల మధ్య ముదిరిన వివాదం
X

దిశ, వెబ్‎డెస్క్ : విజయనగరంలో పూసపాటి వంశీయుల మధ్య వివాదం ముదిరింది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో రాజకుటుంబాల పంచాయతీ రోడ్డెక్కింది. కోట బురుజుపై కూర్చున్న ఆనంద గజపతి రాజు రెండవ భార్య సుధ, కుమార్తె ఊర్మిళ.. కిందకు దింపాలని మాన్సాస్ చైర్మన్ సంచయిత పోలీసులకు తెలిపారు. అయితే కోట నుంచి కిందకు వెళ్లమని తాము చెప్పలేమంటూ పోలీసులు చెప్పడంతో.. కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు. అయితే సంచయిత తీరుకు నిరసనగా.. మెసోనిక్ టెంపుల్ పీవీజీ విగ్రహం వద్ద ఆనందగజపతి రాజు భార్య సుధ, ఊర్మిళ దీక్షకు దిగారు. కాగా ఆనందగజపతి రాజుకు నిజమైన వారసురాలిని తానేనంటూ సోషల్ మీడియా వేదికగా ఊర్మిళా తెలిపారు.



Next Story

Most Viewed