కిసాన్ సమ్మాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారంటే…

by  |
కిసాన్ సమ్మాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారంటే…
X

దిశ,వెబ్‌డెస్క్: ఈ నెల 25‌న మరో విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల కింద రూ.18 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద 9 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్టు పీఎంవో తెలిపింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను వారి అకౌంట్లలలో డిజిటల్ పద్దతిలో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు రాష్ట్రాల రైతులతో ప్రధాని మోడీ మాట్లాడ నున్నారు.

Next Story

Most Viewed