హోటల్ భోజనం లో పురుగులు

by  |
హోటల్ భోజనం లో పురుగులు
X

దిశ, హైదరాబాద్
నారాయణగూడ తాజ్‌మహల్ హోటల్ భోజనంలో పురుగులు వచ్చాయి. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు తన సతీమణి అనూరాధతో కలసి బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు హోటల్ తాజ్‌మహల్‌కు వెళ్ళాడు. వెజ్ ప్రైడ్ రైస్, బేబీ కాన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాడు. బేబీ కాన్ కర్రీ‌లో బొద్దింక కనిపించడంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజలకు మంచి ఆహారం అందించని హోటల్‌ను మూసివేయాలని అచ్యుత‌రావు డిమాండ్ చేశారు.

Tags : insects in food, Taj Mahal Hotel,Narayanguda,Honorary President of the Children’s Rights Commission complaint


Next Story

Most Viewed