భార్యను చితకబాది.. బ్రిడ్జి మీద నుంచి దూకిన భర్త..!

by  |
భార్యను చితకబాది.. బ్రిడ్జి మీద నుంచి దూకిన భర్త..!
X

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై దాడి చేసిన భర్త ఆ తర్వాత అల్గునూర్ సమీపంలోని బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూర్ గ్రామంలో సోమవారం వెలుగుచూడగా స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. రేశవేణి లచ్చయ్య (55) గత కొంతకాలంగా తాగుడుకు బానిసై మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తు్న్నాడు.

ఇరుగుపొరుగు వారిపై అకారణంగా దాడి చేస్తూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం లచ్చయ్య తన భార్య పై దాడికి పాల్పడ్డాడు. ఆమె తలకు తీవ్రగాయం కావడంతో కొడుకు అనిల్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించాడు. ఈలోపే లచ్చయ్య అల్గునూర్ బ్రిడ్జి దగ్గరికు వెళ్లి దానిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి కుమారుడు అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed