ఆ కీలక పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ!

by  |
High court
X

దిశ, వెబ్ డెస్క్: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ పై ధర్మాసం ఇచ్చే తీర్పుపై అందరిలో ఆసక్తి నెలకొన్నది. అయితే గతంలో సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం సచివాలయం కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశిస్తూ ఆ పిటిషన్ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed