స్టే హోం.. స్టే సేఫ్

by  |
స్టే హోం.. స్టే సేఫ్
X

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ లాక్‌డౌన్ పాటించాల‌ని న‌వ‌భార‌త్ వాలంటీర్లు పిలుపునిచ్చారు. క‌రోనా వైర‌స్‌పై వినూత్న‌రీతిలో ప్ర‌చారం చేప‌డుతుండ‌టంతో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని ప‌లు కూడ‌ళ్ల‌లో న‌వ‌భార‌త్ వాలంటీర్లు క‌రోనా వైర‌స్ ఆకారం బొమ్మ‌ల‌ను త‌ల‌పై ధ‌రించి స్టే హోం..స్టే సేఫ్ అంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు రోడ్డుపైకి వ‌చ్చిన వాహ‌న‌దారుల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న తీరుపై అవ‌గాహ‌న క‌ల్పించారు. క‌రోనా వైర‌స్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైందో వివ‌రిస్తూ సామాజిక బాధ్య‌త‌గా ఇంటికే ప‌రిమితం కావాల‌ని సూచించారు. త‌ప్ప‌నిసరి అయితే త‌ప్పా గ‌డ‌ప‌దాటి రావొద్ద‌ని అన్నారు.

Tags : Innovative, campaign, navabharath, volunteers, coronavirus, khammam

Next Story

Most Viewed