- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాక్సినేషన్ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశం అయింది. చంపాపేట్లోని కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లో సరిపడా టీకాలు ఉన్నప్పటికీ సిరంజీల కొరత ఏర్పడింది. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో నుంచి సిరంజీలు తీసుకొచ్చిన వారికి మాత్రమే సిబ్బంది టీకా వేశారు. దాదాపు 1500 మందికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఉన్నప్పటికీ.. సిరంజీలు లేకపోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యానికి సిరంజీల కొరత నిదర్శనం అంటూ అక్కడి స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా తప్పనిసరి అని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా.. అధికారులు కనీసం సిరంజీలు అందుబాటులో ఉన్నాయో లేదో పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story