అండమాన్‌లో అమరావతి రైతుల దీక్ష

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-10 09:40:40  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం టీడీపీ నేతలు అండమాన్ నికోబార్ దీవుల్లో దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమం 300రోజులకు చేరుతున్న సందర్భంగా రైతులకు మద్దతుగా దీక్షలు నిర్వహించారు. దీక్షలో పాల్గొన్న అక్కడి టీడీపీ నేత మాణిక్యాలరావు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రమని రైతులు భూములిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు. రైతులకు కౌలు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో దోచుకున్న భూముల కోసం రైతుల [&hellip;]</p>

అండమాన్‌లో అమరావతి రైతుల దీక్ష
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం టీడీపీ నేతలు అండమాన్ నికోబార్ దీవుల్లో దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమం 300రోజులకు చేరుతున్న సందర్భంగా రైతులకు మద్దతుగా దీక్షలు నిర్వహించారు. దీక్షలో పాల్గొన్న అక్కడి టీడీపీ నేత మాణిక్యాలరావు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రమని రైతులు భూములిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు. రైతులకు కౌలు ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో దోచుకున్న భూముల కోసం రైతుల త్యాగాల్ని వంచించినట్లు ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని మూడు రాజధానుల విధానం తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని దుయ్యబట్టారు.

Next Story