అమానుషం: అలా చేసిందని మహిళను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టి, కారం కొట్టి

by  |
అమానుషం: అలా చేసిందని మహిళను నడిరోడ్డుపై నగ్నంగా నిలబెట్టి, కారం కొట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మహిళపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఈ సృష్టికి మూలమైన ఆడదాన్ని గౌరవించకపోగా వారిపై అరాచకాలకు పాల్పడుతున్నారు. నడిరోడ్డుపై వారి పరువు తీస్తున్నారు. తాజాగా ఓ హత్య కేసులో నిందితురాలి ఉన్న మహిళపై మృతుని కుటుంబ సభ్యులు దారుణానికి తెగబడ్డారు. నడిరోడ్డులో ఆమెను వివస్త్రను చేసి, కళ్లలో కారంకొట్టి, కర్రలతో దాడిచేస్తూ రోడ్లమీద తిప్పారు. ఈ అమానుష ఘటన సూర్యాపేటజిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే.. సూర్యాపేటలోని రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్‌ జూన్‌ 13న హత్యకు గురయ్యాడు. బంధువులతో పాత కక్ష్యలు వలనే అతడిని హత్యచేశారని గుర్తించిన పోలీసులు సదరు గ్రామానికి చెందిన ఓ మహిళను అనుమానించి అరెస్ట్ చేశారు. ఇక ఇటీవల ఆమె బెయిల్ పై విడుదలై తండాకు వచ్చి ఆమె సోదరి ఇంట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శనివారం మృతుడు కుటుంబ సభ్యులు మహిళ ఇంటికి వచ్చిందని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి విచక్షరహితంగా ఆమెపై దాడికి పాల్పడ్డారు.

ఇంటిలోనుంచి ఆమెను బయటికి లాకొచ్చి కళ్లలో కారం కొట్టారు. అనంతరం మహిళను వివస్త్రను చేసి కర్రలతో దాడిచేశారు. నగ్నంగా ఉన్న ఆమెను వీధులలో తిప్పుతూ అరాచకం సృష్టించారు. గ్రామస్తులంతా ఈ ఘటనను కళ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇక ఎట్టకేలకు ఆ కిరాతకులు నుంచి తప్పించుకున్న మహిళా ఆ గ్రామ ఎంపీటీసీ ఇంటికి చేరుకొని రక్షణ కోరింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

నాటు వైద్యుడి ఘాతుకం.. భార్య మర్మాంగానికి కుట్లు వేసి.. ఆపై..

కన్నబిడ్డ పట్ల తల్లి రాక్షసత్వం.. చిత్ర హింసలకు గురిచేస్తూ వీడియోలు



Next Story

Most Viewed