గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట..!

by  |
గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట..!
X

దిశ, పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో రూ. 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్లలో పటాన్‎చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో వైకుంఠధామం, చెత్తసేకరణ కేంద్రాలు, సీసీ రోడ్లు, ఆర్వో ప్లాంట్‎లు లాంటి మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. ఇక రెవెన్యూ వ్యవస్థలో నూతన శకానికి సీఎం కేసీఆర్ నాంది పలకడం హర్షణీయమన్నారు.



Next Story

Most Viewed