- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ అద్భుతమైన ఫలితాలను వెల్లడించింది. మార్కెట్ అంచనాలను అధిగమించి మూడో త్రైమాసిమలో కంపెనీ నికర లాభాలు 16.8 శాతం పెరిగి రూ. 5,215 కోట్లుగా నమోదైంది.గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 4,466 కోట్ల లాభాలను వెల్లడించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 7.3 శాతం వృద్ధి అని కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయం 12.3 శాతం పెరిగి రూ. 25,927 కోట్లకు చేరుకుంది.
అలాగే, ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ మార్జిన్ 25.4 శాతంగా ఉందని, అదేవిధంగా డిజిటల్ ఆదాయం మొత్తం ఆదాయంలో 50 శాతాన్ని దాటాయని కంపెనీ పేర్కొంది. గత ఎనిమిది సంవత్సరాల్లో కంపెనీ ఆదాయంలో ఈ స్థాయి వృద్ధి నమోదవడం ఇదే తిలిసారని, డాలర్ రూపంలో సైతం కంపెనీ ఆదాయం 8.4 శాతం పెరిగి 3,516 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది.