ఎంటర్‌టైనింగ్‌గా ‘ఇందూ కీ జవానీ’ ట్రైలర్

by  |
ఎంటర్‌టైనింగ్‌గా ‘ఇందూ కీ జవానీ’ ట్రైలర్
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ కియారా అద్వానీ లేటెస్ట్ సినిమా ‘ఇందూ కీ జవానీ’ ట్రైలర్ రిలీజైంది. మూవీ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేలా కనిపిస్తుండగా.. ట్రైలర్ స్టార్టింగ్‌లోనే తనను తాను ఘజియాబాద్‌కు చెందిన ఇందు గుప్తాగా పరిచయం చేసుకుంది కియార. తన పర్ఫెక్ట్ పార్టనర్ కోసం వెతుకుతున్న సమయంలో బెస్ట్ ఫ్రెండ్ సలహాతో డేటింగ్ యాప్‌లో ఎకౌంట్ ఓపెన్ చేస్తుంది. ఈ క్రమంలోనే చాలా మందిని కలిసిన ఇందు.. వారి మీద ఇంట్రెస్ట్ చూపించదు. అదే టైమ్‌లో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన చార్మింగ్ అండ్ హ్యాండ్సమ్ ఆదిత్యా సీల్.. హైదరాబాదీగా పరిచయం చేసుకుంటాడు. ఇక తనతో రిలేషన్ కమిట్ అయిపోదామనే టైమ్‌లో ఆదిత్య పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. అప్పుడు ఇందు ఏం చేస్తుంది? అనేది కథ. ట్రైలర్ సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా సాగగా.. సినిమా కూడా అదే స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చనేలా పాజిటివ్ బజ్ ఏర్పడింది.

కాగా ‘ఇందూ కీ జవానీ’ డిసెంబర్ 11న థియేటర్స్‌లోనే రిలీజ్ కానుంది. అబీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భూషణ్ కుమార్, నిఖిల్ అద్వానీ నిర్మాతలు కాగా.. సెప్టెంబర్‌లో రిలీజైన ‘హసీనా పాగల్ దివాని సాంగ్’ సూపర్ హిట్ అయింది. ముందుగా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నా దేశవ్యాప్తంగా థియేటర్స్ ఓపెన్ కావడంతో బిగ్ స్క్రీన్‌పైనే సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు ఫిల్మ్ మేకర్స్.


Next Story

Most Viewed