పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీ ఫైనల్స్‌లో హాకీ జట్టు

by  |
పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీ ఫైనల్స్‌లో హాకీ జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ‌లో భారత హాకీ జట్టు సత్తా చాటింది. శుక్రవారం ఢాకా వేదికగా దాయాది జట్టు పాకిస్తాన్‌పై‌ 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ రెండు గోల్స్ చేయగా.. ఆకాశ్ దీప్ ఒక గోల్ చేసి జట్టును గెలిపించుకున్నారు. ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ‌లో ఇప్పటికే తొలి మ్యాచ్‌లో కొరియాతో 2-2 డ్రా చేసుకున్న మన్ ప్రీత్ సింగ్ సేన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0 పూర్తి ఆధిక్యాన్ని కనబర్చింది. ఇక ఇదే జోష్‌లో శుక్రవారం మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 3-1ను ఓడించి.. ఏకంగా సెమీ ఫైనల్స్‌కు దూసువెళ్లింది.

Next Story

Most Viewed