- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: 2021 ఏడాది జనవరి 14తో ముగిసిన మొదటి 15 రోజుల్లో భారత ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 10.92 శాతం పెరిగి సుమారు రూ. 87.3 వేల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ముఖ్యంగా ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాల వృద్ధికి దారితీసింది. ఈ వృద్ధి కార్యకలాపాల పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా జనవరిలో 1 నుంచి 14వ తేదీల మధ్య కాలంలో దిగుమతులు 6.58 శాతం పెరిగి సుమారు రూ. 1.33 లక్ష కోట్లకు చేరుకున్నాయి. ఈ పెరుగుదలకు ముఖ్యంగా బంగారం, ముత్యాలు, విలువైన రత్నాలు దోహదపడ్డాయి. సమీక్షించిన ఈ కాలంలో బంగారు దిగుమతుల విలువ సుమారు రూ. 3,345 కోట్లు పెరిగాయి. మూడు నెలల తర్వాత డిసెంబర్లో భారత ఎగుమతులు వృద్ధిని సాధించాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు ఎగుమతులు పుంజుకోవడంతో వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాల్లో పెట్రోలియం, చమురు మినహా ఎగుమతులు 16.07 శాతం పెరగ్గా, పెట్రోలియం మినహా దిగుమతులు 18.78 శాతం పెరిగాయి.