నల్లమల వాసి శంకర్ బాబుకు భారతీయ సేవ రత్న పురస్కారం

by  |
నల్లమల వాసి శంకర్ బాబుకు భారతీయ సేవ రత్న పురస్కారం
X

దిశ, లింగాల: సామాజిక సేవా కార్యక్రమాలను అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న నల్లమల ప్రాంతంలోని లింగాల మండల పరిధిలో గల ఏజెన్సీ గ్రామమైన ధారారంకు చెందిన సామాజిక వేత్త, పేద ప్రజల కోసం సేవ చేస్తున్న డాక్టర్ నూకల శంకర్ బాబు భారతీయ సేవ రత్న పురస్కారం అందుకున్నారు. ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి మంగళవారం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భారతీయ సేవ రత్న పురస్కారాన్ని శంకర్ బాబుకు సినీ ప్రముఖురాలు రాగిణి, మల్కాజిగిరి కోర్టు జడ్జి, రిటైర్డ్ మెంట్ పెన్షన్ కార్యదర్శి రాంచంద్రరావు, నిర్వాహకులు రంజిత్ కుమార్, యాంకర్ భైరవ శర్మలు అందించారు.

నూకల రాజమనెమ్మ ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ సహాయ సహకారాలను అందిస్తూ, లాక్ డౌన్ సమయంలో చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ సంస్థ విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేసి గౌరవించింది. నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన పలు జాతీయ సంస్థలు శంకర్ బాబుకు అనేక పురస్కారాలు అందజేయడంతో పాటు గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేశాయి. ఆయన మాట్లాడుతూ.. ఈ పురస్కారం తనకు ఇవ్వడం బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. శంకర్ బాబుకు భారతీయ సేవ రత్న పురస్కారం రావడం పట్ల ధారారం గ్రామ సర్పంచ్ కవిత శ్రీనివాసులు, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అశోక్ రెడ్డి ,పలువురు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed