ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు.. ఆర్సీబీ వర్సెస్ ఢీల్లీ క్యాపిటల్స్

by  |
ఐపీఎల్‌లో నేడు ఆసక్తికర పోరు.. ఆర్సీబీ వర్సెస్ ఢీల్లీ క్యాపిటల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్‌ 14లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన ఆర్సీబీ స్పీడ్‌కు.. ఐదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్‌లు వేసిన సంగతి తెలిసిందే. ఇక 22వ మ్యాచ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇరు జట్లు కూడా ఇప్పటికే 5 మ్యాచులు ఆడగా.. నాలుగింట్లో విజయం సాధించి.. మరో మ్యాచ్‌లో పరాజయం పొందాయి. తలో 8 పాయింట్లతో రెండో స్థానంలో ఢిల్లీ, మూడో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్‌గా ఉంటుంది. దీంతో 22వ మ్యాచ్‌ను కైవసం చేసుకునేందుకు రెండు జట్లు కూడా సమాయత్తం అవుతున్నాయి.



Next Story

Most Viewed