పాక్ దుశ్చర్య.. భారత జవాన్ మృతి

by  |
పాక్ దుశ్చర్య.. భారత  జవాన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి రాజౌరీ జిల్లా సుందర్‌బనీ సెక్టార్‌లో పాక్ సైన్యం అప్రకటిత కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత్ జవాన్ లక్ష్మణ్ మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌వాసి. పాక్ కాల్పులను భారత్ బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయని రక్షణ ప్రతినిధి తెలిపారు.



Next Story

Most Viewed