- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఉన్నత ఉద్యోగం కోసం స్వదేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లిన ఒక సాఫ్టేవేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తుంది. వారు నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని ప్లాట్ లో రక్తపు మడుగులో ఇద్దరి మృతదేహాలు కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలలోకి వెళితే…. మహారాష్ట్ర బీడ్ జిల్లా అంబాజోగై కు చెందిన బాలాజీ భరత్ రుద్రవర్.. ఆయన భార్య ఆర్తి బాలాజీ రుద్రవర్ న్యూజెర్సీ శివార్లలోని నార్త్ అర్లింగ్టన్లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాలాజీ 2015 లో ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ళ పాప ఉండగా .. ఆర్తి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి.
బుధవారం చిన్నారి తమ ఇంటి బాల్కనీ వద్ద గుక్క పెట్టి ఏడుస్తుండగా గమనించిన స్థానికులు ఇంటి తలుపు కొట్టి తల్లిదండ్రులను పిలవడానికి ప్రయత్నించారు. ఎంతకీ తలుపులు తెరుచుకోకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోపల చూడగా రక్తపు మడుగులో బాలాజీ దంపతులు విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలపై కత్తి గాట్లు ఉండడంతో ఇది ఖచ్చితంగా హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అమెరికా మీడియా మాత్రం ఇంట్లో గొడవ జరిగినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని, మొదట బాలాజీ భార్యను చంపి, అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ అందిన తరువాతే.. అది హత్య లేదా ఇంకేదైనా అనేది నిర్ధారిస్తామని పోలీసులు స్పష్టం చేసినట్లు తెలిపింది.