బయటపడ్డ ఆర్మీ ఆఫీసర్ బాగోతం.. మూడు చోట్ల ముగ్గురితో రొమాన్స్.. చివరికి

by  |
బయటపడ్డ ఆర్మీ ఆఫీసర్ బాగోతం.. మూడు చోట్ల ముగ్గురితో రొమాన్స్.. చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి అనేది ఒక నమ్మకం.. భార్యాభర్తల మధ్య ఆ నమ్మకమే వారిని జీవితాంతం కలిసి ఉండేలా చేస్తోంది. కానీ, ప్రస్తుతం జంటల తీరు మాత్రం విరుద్ధంగా ఉంటుంది. ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ, ఇంకొంతమంది అయితే ఏకంగా ఒక భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఇలాంటి మోసాలకు పాల్పడే వారు దేశం గర్వించదగ్గ వృత్తిలో ఉండడం సిగ్గుచేటు. తాజాగా ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక భార్యకు తెలియకుండా మరొకరిని, ఆమెకు తెలియకుండా ఇంకొకరిని ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేశాడు. ఆ విషయం తెలుసుకున్న రెండో భార్య అతడు రెండో భార్యతో కాపురం చేస్తున్న చోటుకు వెళ్లి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. మనీష్ శంకర్ అనే వ్యక్తి భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మొదట అతడు షాలిని అనే మహిళను వివాహమాడాడు. వారికి ఇద్దరు పిల్లలు.. ఆమె హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. అయితే భర్త ఆరునెలలకు ఒకసారి ఇంటికి వస్తుండడంతో ఆర్మీలో పనిచేస్తున్నాడు కదా విధులకు వెళుతున్నాడేమోనని అనుకుంది. ఆ తర్వాత ఇంటికి రావడం పూర్తిగా తగ్గించేయడంతో షాలినికి అనుమానం మొదలయ్యింది. దీంతో ఆమె భర్త గురించి ఆరా తీస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తకు ముందే మోనికా అనే మహిళతో పెళ్లి అయ్యిందని, ఆమె హర్యానాలోని పానిపట్ లో ఉంటుందని తెలుసుకుంది.

అంతేకాకుండా ఇటీవల భర్త మూడో పెళ్లి చేసుకొని మీరట్ లో కాపురముంటున్నట్లు తెలియడంతో షాలిని కోపంతో ఊగిపోయింది. ఇద్దరు పిల్లలని తీసుకొని ఉత్తర ప్రదేశ్ వెళ్లి మూడో భార్యతో కాపురముంటున్న భర్త బాగోతం చూసింది. ఇక వెంటనే తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను మోసం చేసాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed