ఆ హీరోయిన్‌ను మాకిస్తే కశ్మీర్‌ను వదిలేస్తాం : పాక్ సైన్యం

by  |
ఆ హీరోయిన్‌ను మాకిస్తే కశ్మీర్‌ను వదిలేస్తాం : పాక్ సైన్యం
X

దిశ, సినిమా: ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ‘షేర్షా’ మూవీ కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బత్రా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కి విషయం తెలిసిందే. ఈ మేరకు టైటిల్ రోల్‌ పోషించిన సిద్ధార్థ్ మల్హోత్రాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే కార్గిల్ వార్ సమయంలో పాకిస్థాన్ సైనికులు బాలీవుడ్ హీరోయిన్స్ మాధురి దీక్షిత్, రవీనా టాండన్‌ను దూషిస్తూ కామెంట్స్ చేసినట్టు చూపించారు. యుద్ధం జరుగుతుండగా.. భారత సైన్యాన్ని రెచ్చగొట్టేలా మాధురి, రవీనాను మాకు ఇస్తే కశ్మీర్‌ను భారత్‌కు వదిలేస్తామన్న పాక్ సైన్యానికి ఇండియన్ ఆర్మీ కెప్టెన్ బత్రా బేఫిట్టింగ్ రిప్లయ్ ఇస్తాడు. ‘మీ అందరి కోసం మాధురి దీక్షిత్ నుంచి ప్రేమతో’ అంటూ హ్యాండ్ గ్రెనేడ్‌తో దాడిచేస్తాడు. కార్గిల్ వార్‌లో ఈ ఇన్సిడెంట్‌ నిజంగానే చోటుచేసుకుందని తెలుస్తోంది. ఇక రవీనా టాండన్ విషయంలోనూ ఇదేవిధంగా జరగగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిసైల్‌తో రిప్లయ్ ఇచ్చింది. దానిపై ‘రవీనా టాండన్ నుంచి నవాజ్ షరీఫ్’కు అని రాసి పంపింది.

Read More:

బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..

అప్పటి మాయ లేడీ.. ఇప్పుడు మోస్ట్ డిజైరబుల్ ఉమన్

Madhuri Dixit



Next Story

Most Viewed