- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోర్డర్లో తనిఖీలు.. వెపన్స్, పాక్ కరెన్సీ స్వాధీనం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. దీంతో జమ్ముకశ్మీర్లోని పాక్ సరిహద్దుల్లో జవాన్లు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జరిపిన గాలింపు చర్యల్లో భద్రతా సిబ్బంది పలు ఆయుధాలను, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా బారాముల్లా జిల్లాలో గత రెండ్రోజులుగా భద్రతా బలగాలు సుదీర్ఘ గాలింపు చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 11న గాలింపు చర్యలు ప్రారంభించగా, ఇవాళ పలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. దీంతో జమ్ముకశ్మీర్లోని పాక్ సరిహద్దుల్లో జవాన్లు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జరిపిన గాలింపు చర్యల్లో భద్రతా సిబ్బంది పలు ఆయుధాలను, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది.
ముఖ్యంగా బారాముల్లా జిల్లాలో గత రెండ్రోజులుగా భద్రతా బలగాలు సుదీర్ఘ గాలింపు చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 11న గాలింపు చర్యలు ప్రారంభించగా, ఇవాళ పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పెద్ద ఎత్తున పట్టుబడింది. వాటిని ఆర్మీ వర్గాలు స్వాధీనం చేసుకున్నారు.వాటిలో 3 పిస్టల్స్, మ్యాగ్జిన్స్, 73 రౌండ్ల బుల్లెట్లు, రెండు డిటోనేటర్లు, 15 గ్రనేడ్లతో పాటు పాకిస్థాన్కు చెందిన నగదును స్వాధీనం చేసుకున్నారు.
Next Story






