పాక్, చైనా లకు వాయుసేన వార్నింగ్  

by  |
పాక్, చైనా లకు వాయుసేన వార్నింగ్  
X

దిశ, వెబ్ డెస్క్: సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ఊరుకొనేది లేదంటోంది భారత్. ఫార్వార్డ్ ఎయిర్ బేస్ వద్ద గగనతలంలో విన్యాసాలు చేసింది భారత వాయుసేన. శత్రుసైన్యాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు యుద్ధసామగ్రితో ప్రాక్టీస్ చేస్తోంది. పాకిస్తాన్ కు 50కి.మీ.లు, దౌలత్ బేగ్ ఓల్డీ కి 80కి.మీ.ల దూరంలో ఉన్న ఫార్వార్డ్ ఎయిర్ బేస్ వద్ద విన్యాసాలు చేస్తోంది భారత వైమానిక దళం. పాక్ చైనా ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా వెనక్కి మళ్లేలా దీటైన జవాబిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.



Next Story

Most Viewed