లంచ్ విరామానికి భారత్ 82/2

by  |
లంచ్ విరామానికి భారత్ 82/2
X

దిశ, వెబ్‌డెస్క్: హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్నరెండో టెస్ట్‌లో భారత్ లంచ్ విరామానికి 2వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులకే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా మరో ఓపెనర్ ప‌ృథ్వీషాకు చక్కటి సహకారం అందించాడు. పృథ్వీ షా 64 బంతుల్లో( 54, 8ఫోర్లు, ఓ సిక్సర్‌తో) అర్థ సెంచరీ చేసి జేమీసన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ(3), పుజారా(15) పరుగులతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

Next Story

Most Viewed