ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై టీమిండియా గెలుపు

by  |
ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై టీమిండియా గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: జైపూర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బ్లాక్ క్యాప్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. ఆ జట్టులో మార్టిన్ గప్తిల్(70), చాప్‌మన్ (63) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి మరో రెండు బంతులు మిగిలి ఉండగా 166 లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియాలో రోహిత్ శర్మ (48), సూర్య కుమార్ యాదవ్ (62) మెరుపు ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ చేరగా.. రిషబ్ పంత్ (17 నాటౌట్), అక్షర్ పటేల్(1 నాటౌట్‌)గా నిలిచి జట్టును గెలిపించారు. మిగతా బ్యాటర్లు కేఎల్ రాహుల్ (15), శ్రేయస్ అయ్యర్(5), వెంకటేష్ అయ్యర్ (4) పేలవ ప్రదర్శన చేయడం గమనార్హం.



Next Story

Most Viewed