సౌత్‌ఆఫ్రికా సిరీస్‌కు టీమిండియా మహిళా జట్టు ఇదే

by  |
సౌత్‌ఆఫ్రికా సిరీస్‌కు టీమిండియా మహిళా జట్టు ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మహిళా జట్టు మార్చి నెలలో దక్షిణాఫ్రికా జట్టుతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్నది. మార్చి 7 నుంచి 23 వరకు జరగనున్న ఈ సిరీస్‌లో ఐదు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా ఇంటర్నేషనల్ స్టేడియంలోనే మొత్తం మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన మహిళా జట్లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే జట్టుకు మిథాలీ రాజ్, టీ20 జట్టుకు హర్మన్ ప్రీత్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

వన్డే జట్టు :

మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెర్మియా రోడ్రిగ్స్, పూనమ్ రౌత్, ప్రియా పునియా, యాస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), డి. హేమలత, దీప్తి శర్మ, సుష్మ వర్మ (వికెట్ కీపర్), శ్వేతా వర్మ (వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, ఝులన్ గోస్వామి, మన్షీ జోషి, పూనమ్ యాదవ్, ప్రత్యూష, మోనికా పటేల్.

టీ20 జట్టు :

హర్మన్ ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెర్మియా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ దేవల్, సుష్మ వర్మ (వికెట్ కీపర్), నుఝత్ పర్వీన్ (వికెట్ కీపర్), ఆయుషీ సోని, అరుంధతీ రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్, మన్షీ జోషి, మోనికా పటేల్, ప్రత్యూష, సిమ్రన్ దిల్ బహదుర్.


Next Story

Most Viewed