దేశంలో ప్రస్తుతం ఎన్ని కరోనా కేసులంటే..?

by  |
దేశంలో ప్రస్తుతం ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 26,506 కరోనా కేసులు నమోదు కాగా, 475 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 7,93,802 కు చేరుకుంది. ఇందులో 4,95,513 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 2,76,685 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 21,604 కు చేరుకుంది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో సామాజిక వ్యాప్తి లేదని మరోసారి వెల్లడించింది.

Next Story

Most Viewed