ఇండియాలోనే ఆసియా కప్ మహిళా ఫుట్‌బాల్ టోర్నీ

by  |
ఇండియాలోనే ఆసియా కప్ మహిళా ఫుట్‌బాల్ టోర్నీ
X

దిశ, స్పోర్ట్స్: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆసియా కప్ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ 2022లో ఇండియాలో నిర్వహించనున్నారు. 41 ఏళ్ల తర్వాత ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ప్రకటించింది. ‘ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ కమిటీ సిఫార్సుల మేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కు కట్టబెడుతున్నాం’ అని ఏఎఫ్‌సీ కార్యదర్శి డాటో విండ్సర్‌ జాన్‌ తెలిపారు. మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. కాగా, ఆతిథ్య దేశం హోదాలో భారత్ నేరుగా అర్హత పొందుతుంది. 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్‌కు ఇదే ఆఖరి అర్హత టోర్నీ కావడం గమనార్హం.

Next Story

Most Viewed