అడ్డుతగిలిన వరుణడు.. భారత్-శ్రీలంక మూడో వన్డేకు అంతరాయం

by  |
rain-match
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వరుణుడు అడ్డుతగిలాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పృథ్వీషా (49) సంజూ శాంసన్ (46) మ్యాచ్ ప్రారంభం నుంచి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు.

అయితే, దురదృష్టవశాత్తు ఇద్దురు హాఫ్ సెంచరీ దగ్గరి వరకు వచ్చి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (22), మనీష్ పాండే (10) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 23 ఓవర్ల సమయంలో వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టాక తిరిగి మ్యాచ్ ప్రారంభంకానుంది.



Next Story

Most Viewed