మళ్లీ టాస్ ఓడిన టీమిండియా.. కివీస్‌తో టెన్షన్.. టెన్షన్..!

by  |
మళ్లీ టాస్ ఓడిన టీమిండియా.. కివీస్‌తో టెన్షన్.. టెన్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్-న్యూజీలాండ్‌ జట్లు మైదానంలోకి దిగాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు రానుంది. ఇరు జట్లకు సెమీస్‌ బెర్తు కోసం ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, భారత్ భారీ స్కోర్‌ చేస్తే తప్పా గెలిచే అవకాశాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. మంచి స్కోర్ ఉంటేనే బౌలర్ల మీద ఒత్తిడి ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు న్యూజీలాండ్ జట్టు కూడా టీ20లో భారత్‌పై బోణీ కొట్టేందుకు తహతహలాడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.



Next Story

Most Viewed