- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు గతంలో 2030 ఎజెండాలో భాగంగా ఎంచుకున్న 17 ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ)’ జాబితాలో భారత ర్యాంక్ రెండు స్థానాలు పడిపోయి 117కి చేరుకున్నట్టు ఓ నివేదిక తెలిపింది. స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ రిపోర్ట్-2021లో గతేడాది భారత్ ర్యాంకు 115వ స్థానం నుంచి ఈ ఏడాది రెండు స్థానాలు పడిపోయినట్టు పేర్కొంది.
ప్రధానంగా ఆహర భద్రత, లింగ సమానత్వం సాధించడం, పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, ప్రోత్సాహకాలు, స్థిరమైన పారిశ్రామికీకరణ, ప్రోత్సాహక ఆవిష్కరణల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో ఇతర ఆసియా దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లు భారత్ కంటే మెరుగైన ర్యాంకును సాధించాయి. భారత్ మొత్తం ఎస్డీజీ స్కోరు 100కు 61.9 పాయింట్లను సాధించింది.
Next Story